దర్శి: కురిచేడు మండలంలోని గంగదొనకొండ గ్రామంలో రంగ రంగ వైభవంగా గంగ భవాని తిరునాళ్లు
Darsi, Prakasam | Apr 14, 2025 కురిచేడు మండలంలోని గంగదొనకొండ గ్రామంలో గంగ భవాని తిరునాళ్లను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోకి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నారాయణ మాట్లాడుతూ.. గంగాభవాని తిరుణాళ్ళ సందర్భంగా నేటి రాత్రికి మూడు ఎలక్ట్రికల్ విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలిపారు.