-ప్రభుత్వ నిర్ణయంతో సన్నరకం ధాన్యంకు ఎకరానికి కనీసం 12,500 రూ. అదనపు లాభం అంటున్న రైతులు -జిల్లా సహకార శాఖ ద్వారా రూ. 60 లక్షల విలువగల 2590 క్వింటాల్ల సన్నరకం వరి ధాన్యం కొనుగోలు: జిల్లా సహకార శాఖ అధికారి సీ హెచ్. మనోజ్ కుమార్ సన్న రకం వరిధాన్యంకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలుకు మద్దతు ధరతోపాటుగా 500 రూ. బోనస్ అందజేయడంపై జిల్లా వ్యాప్తంగా రైతులు పలుచోట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంలో ప్రభుత్వానికి రైతులు కృతజ్ఞతలు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో సన్నరకం ధాన్యంకు ఎకరానికి కనీసం 12,500 రూ. అదనపు లాభం కలుగుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.