నిర్మల్ పట్టణంలోని రాంనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం 'ఆరోగ్య మహిళ- శక్తివంతమైన కుటుంబం' కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రసూతి వైద్య నిపుణులు డా. విన్నీ శ్రీ గర్భిణులు, స్త్రీ సంబంధిత సమస్యలు ఉన్నవారికి వైద్య పరీక్షలు చేసి చికిత్స అందించారు. కిశోర బాలికలు, మహిళలకు పోషకాహారం, రుతుస్రావ పరిశుభ్రతపై కౌన్సిలింగ్ ఇచ్చారు.