పిట్టచలం, కాకరపాడు గ్రామాల మధ్యలో, జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి
కొయ్యూరు మండలంలోని పిట్టచలం, కాకరపాడు గ్రామాల మధ్యలో ఉన్న జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్పై వెళుతున్న యువకుడు అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. మృతుడు పాంగి అఖిల్ అని, అతడి తండ్రి మంప పోలీస్ స్టేషన్లో హోం గార్డుగా పనిచేస్తున్నారని అంటున్నారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.