మొంథా తుఫాన్ ప్రభావంతో పొలాల్లో నిలిచిన నీటి వెంటనే తొలిగించే ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు, అధికారులను ఆదేశించారు. శనివారం దోర్నాల,మార్కాపురం మండలంలోని పలు గ్రామాలను సందర్శించి దెబ్బతిన్న పత్తి మిరప మరియు ఇతర పంటల ను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మొంథా తుఫాను వల్ల నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ తుఫాను వలన రికార్డు స్థాయిలో 20 సెంటీమీటర్ల వర్షం నమోదు అయిందని, ఫలితంగా వాగులు, వంకల్లో ప్రవాహం పెరిగి పంట పొలాలు, కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు చేరాయి అన్నారు. కొన్నిచోట్ల రోడ్లు కూడా దెబ్బతిన్నట్లు తెలిపారు.