పుట్టపర్తి మండలం పెడబల్లి వద్ద కారు, ద్విచక్ర వాహనం ఢీ, ఒక వ్యక్తి దుర్మరణం
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి మండలం పెడబల్లి వద్ద ద్విచక్ర వాహనా న్ని కారు ఢీకొన్న ఘటనలో ఒకరు దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. పెడబల్లికి చెందిన చాకలి మహేష్, రంగప్ప అనే వ్యక్తులు ద్విచక్ర వాహనంలో వస్తుండగా ఎదురుగా వచ్చిన కారు వేగంగా వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో రంగప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. మహేష్ కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అతన్ని పుట్టపర్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు.