దర్శి: ముండ్లమూరు మండలంలో దెబ్బతిన్న ప్రతి పంటకు నష్టపరిహారం ఇవ్వాలని మండల వ్యవసాయ అధికారికి రైతులు వినతి
Darsi, Prakasam | Apr 16, 2025 ముండ్లమూరు మండలంలోని ఈ మధ్య కురిసిన అకాల వర్షాలకు ఈదురుగాలికి మండలంలో బొప్పాయి, మిర్చి, మొక్కజొన్న, వరి, పొగాకు, పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారని రైతు సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులు తాము లక్షల్లో పెట్టుబడి పెట్టి ఈ వర్షం వల్ల పూర్తిగా నష్టపోయామని తమను ప్రభుత్వం ఆదుకోవాలని ముండ్లమూరు మండల కమిటీ సభ్యులు,మండల వ్యవసాయ అధికారికి వినతిపత్రం అందజేశారు.