కోడుమూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని లద్దగిరి గ్రామ సమీపంలో హంద్రీనీవా కాలువలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. అందిన సమాచారం మేరకు మృతదేహాన్ని బయటకు తీయించినట్లు తెలిపారు. మృతుడి వయసు దాదాపు 30 ఏళ్లు ఉండవచ్చన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.