కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని శివారు లోని రేనుకా నగర్ లో రెండు కోట్లకు పైగా విలువైన 20 సెంట్ల పార్కు స్థలాన్ని కాపాడాలని పాలకులకు, అధికారులకు ఎన్ని అర్జీలు ఇచ్చినా.. స్పందించేవారే కరువయ్యారని కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు సి శ్రీరాములు, కార్యదర్శి పి సుబ్బారెడ్డి, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం 12 గంటలు పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం స్థానికులతో కలిసి కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఆ పార్కు ఆక్రమణకు గురికాకుండా కాపాడాలని నగరపాల సంస్థ కార్యాలయానికి వెళ్ళినప్పుడల్లా ప్ర