ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాకాల సముద్రతీరంలో ఫిబ్రవరి 14, 15వ తేదీలలో జరిగే బీచ్ ఫెస్టివల్ ప్రోమోని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి విడుదల చేశారు. ఈ ఫెస్టివల్లో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆటలు, పాటలు, వాటర్ రైడ్స్, హెలికాప్టర్ రైడ్, ఫుడ్ స్టాల్స్, కళా ప్రదర్శనల కార్యక్రమాలు జరుగుతాయని మంత్రి తెలిపారు. ఈ వీడియో సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్థానిక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.