లక్ష్మణ్చందా మండలం వడ్యాల్ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆర్జెడీ సత్యనారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. 100% హాజరు పెంపు, గ్రంథాలయ తరగతులు పకడ్బందీగా నిర్వహణ, ల్యాబ్ మెటీరియల్–డిజిటల్ బోధన వినియోగం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.