కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు రాత్రి, తెల్లవారుజామున తిరిగే వాహనాలలో సరైన భద్రతా చర్యలు , జాగ్రత్తలు పాటించాలని కర్నూల్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవర్ల లైసెన్సుల వంటి భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు కర్నూలు పోలీసులు భారీ వాహానాలకు “స్టాప్ - వాష్ అండ్ గో” కార్యక్రమం నిర్వహిస్తున్నారు. జిల్లా లో ఆదోని, పత్తికోండ, ఎమ్మిగనూరు, కర్నూలు సబ్ డివిజన్ లలో హైదరాబాద్- బెంగుళూరు, హైదరాబాద్ – చైన్నె ల నేషనల్ హైవే – 40, నేషనల్ హైవే – 44 ల లో