ఆక్రమించుకున్న మహానంది దేవస్థాన భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్న ఆలయ ఈవో నల్ల కాలువ శ్రీనివాసరెడ్డి
నంద్యాల మండలం మూలసాగరం పరిధిలో ఆక్రమణలో ఉన్న శ్రీ మహానందీశ్వర స్వామి దేవస్థానం భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ఆలయ ఈవో నల్లకాలువ శ్రీనివాస రెడ్డి తెలిపారు. సర్వే నంబర్ 974/1లోని 5-68 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారని చెప్పారు. దీంతో రికార్డుల ప్రకారం స్వాధీనం చేసుకున్నామన్నారు. సర్వే చేయించి సంబంధిత భూమిని లీజుకు ఇచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు.