శ్రీశైలం: మహానంది మండలం అబ్బిపురం గ్రామంలో అరటి తోటలలో అగ్నిప్రమాదం. కాళీ బూడిదైన అరటి, నిమ్మ చెట్లు .2 లక్షల మేర ఆస్తి నష్టం
మహానంది మండలం అబ్బీపురం గ్రామానికి చెందిన మిలిటరీ సుబ్బారెడ్డి అనే రైతు పొలంలో అరటి,నిమ్మచెట్లు ప్రమాదవశాత్తు కాలిపోయాయి.సోమవారం సాయంత్రం అబ్బీపురం గ్రామం సమీపంలోని కృష్ణనందికి వెళ్లే రహదారిలో ఎకరం పొలంలో అరటి పంట, నిమ్మచెట్లు,డిప్పు పైపులు,తీగలు అగ్నికి ఆహుతి అయ్యాయి.అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించగా వారు సంఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు.సుమారు 2 లక్షలు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు.