సిఐటియు అఖిల భారత మహాసభల విజయానికి సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కర్నూలులో నిధి సేకరణ చేపట్టింది. సి క్యాంపు లలిత కళా సమితిలో నిర్వహించిన కార్యక్రమంలో రూ.18,700 విరాళాలు సేకరించినట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా పాల్గొన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, కార్మిక–కర్షక ఐక్యత కోసం రాష్ట్రవ్యాప్తంగా నిధి సేకరణ కొనసాగుతున్నదని చెప్పారు. విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు జరగనున్న అఖిల భారత మహాసభలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.