కార్వేటినగరం మండలంలోని చెరువులను నీటిమట్టాన్ని ఇరిగేషన్ శాఖ ఏఈ భాస్కర్ రాజీవ్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 29వ తేదీ నుంచి రెండవ తారీకు వరకు తుఫాన్ ప్రభావం అత్యధికంగా ఉన్న సందర్భంగా మండలంలోని చెరువుల నీటిమట్టాన్ని పరిశీలించామన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.