కర్నూలు: చనిపోయి.. నలుగురికి పునర్జన్మ.!...బైక్ ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన ఆత్మకూరుకు చెందిన ప్రశాంత్ చనిపోయి కూడా మరో నలుగురికి ప్రాణం పోశారు. జీవన్దాన్ ద్వారా అవయవాలను దానం చేసినట్లు డాక్టర్ ఆనంద్ తెలిపారు. ఆయన లివర్, కిడ్నీలను కర్నూలు కిమ్కు, మరో కిడ్నీని గ్రీన్ ఛానల్ ద్వారా నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. నేత్రాలను కర్నూలులోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి అందజేశారు.