శ్రీశైలం: రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు నీటినందించే ప్రధాన కాల్వల మరమ్మతులకు నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు నీటినందించే ప్రధాన కాల్వల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.శ్రీశైలం నియోజకవర్గ వెలుగోడు పరిధిలో వి.బి.ఆర్ వంటకాలువల మరమ్మతులకు రూ. 1.20 కోట్లు వెచ్చిస్తారు. శ్రీశైల జలాశయ ఆనకట్ట పరిధిలో పనులకు 4.34 కోట్లు, కేసీ కెనాల్ మరమ్మతులకు, నంద్యాల, శ్రీశైలం, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో 80 పనులకు రూ. 7.17 కోట్లు విడుదల చేశారు. మొత్తం పై నంద్యాల జిల్లాలో 271 పనులకు రూ. 26.03 కోట్లు, కర్నూలు జిల్లాలో 140 పనులకు రూ. 13.86 కోట్ల నిధులు మంజూరయ్యాయి. నీ నిర్మాణాలన్నింటినీ ఈ ఏడాది నీటి సంవత్సరం ప్రారంభం అయ్యేలోగా పూర్తిచేయలన్నారు.