శ్రీశైలం: మహానంది మండలంలో ఆగని ఎర్రమట్టి తవ్వకాలు.చోద్యం చూస్తున్న అధికారులు..
మహనంది మండలం గోపవరం చెరువు సమీపంలోని వ్యవసాయ భూమి నుండి అక్రమంగా ఎర్రమట్టి రవాణా ఎత్తేచగా కొనసాగిస్తున్నారు. సంబంధిత అధికారులు మాత్రం మాకేమీ తెలియదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. వ్యవసాయ కళాశాల సమీపంలోని కాశిరెడ్డి నాయన పిల్ల కాలువగుండా వ్యవసాయ రైతులు తమ మాసూలు తరలించుకోవడానికి ఇబ్బందికరంగా మారుతుందని, టిప్పర్లు తిరగడం వలన వర్షాకాలం కావడంతో గుంతలుగా ఏర్పడి తమ పండించిన పంటను బయటకు చేర్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎర్రమట్టి తవ్వకాలు నిలుపుదల చేయాలని కోరుతున్నారు.