శ్రీశైలం: మహానంది మండలం యు. బొల్లవరం గ్రామంలో తీవ్రంగా తాగునీటి సమస్య .ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు.
మహానంది మండలం యు.బొల్లవరంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. చేతిబోర్లు పనిచేయకపోవడంతో ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవికాలం కావడంతో మంచినీటికి అవస్థలు పడుతున్నారు. మహిళలు, చిన్నారులు గంటల తరబడి వేచి ఉండి బిందె నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.