పెదచెర్లోపల్లి: పెదచెర్లోపల్లి మండలంలోని పాలేటి గంగమ్మ తల్లి తిరునాళ్ల బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు
India | May 4, 2026
పెద్ద చెర్లోపల్లి మండలంలోని పాలేటి గంగమ్మ తల్లి తిరునాళ్ల లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు చర్యలను చేపట్టాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశించారు. సోమవారం పాలేటి గంగమ్మ తల్లి ఆలయం వద్ద బందోబస్తు ఏర్పాట్లపై స్థానిక పోలీసులతో ఎస్పీ సమీక్షించారు. తిరునాళ్ల లో ఎటువంటి దొంగతనాలు చోటు చేసుకోకుండా పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేయాలన్నారు. భారీగా తరలివచ్చే భక్తులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.