ఆందోల్: జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ సూపరిoటెండెంట్ కు వినతి పత్రం అందజేత
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేట వంద పడకల ప్రభుత్వాసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి రెండు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ గురువారం మధ్యాహ్నం 3 గంట సమయంలో ఏఐటియుసి జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఏఐటియుసి ఆధ్వర్యంలో సిబ్బంది సూపరింటెండెంట్ సౌమ్యకు వినతి పత్రాని అందజేసి తమ సమస్యలను తీర్చాలంటూ కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటరాజ్యం తదితరులు పాల్గొన్నారు.