శ్రీశైలం: శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీగా హుండీ ఆదాయం. 27 రోజుల హుండీ ఆదాయం రూ 5 కోట్ల 45 లక్షల 55 వేల 035 నగదు రాబడి
శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీగా హుండీ ఆదాయం లభించింది శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, హుండీ లెక్కింపు నిర్వహించారు అక్క మహాదేవి అలంకార మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 5 కోట్ల 45 లక్షల 55 వేల 035 రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు ఈ ఆదాయాన్ని గత 27 రోజులులో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్లు ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు.