అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని బీసీ కాలనీ లో రామకృష్ణ, హరికృష్ణ, రవికృష్ణ, తిమ్మారెడ్డి అనే రైతులకు చెందిన జొన్న సొప్ప, వేరుశనగ పొట్టు, వరిగడ్డి వాములకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో దగ్ధమయ్యాయి. బాధిత రైతులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుత్తిలోని బీసీ కాలనీ వెనకాల రైతులు 30 పశువులు కొనుగోలు చేసి పశు పోషణతో జీవనం సాగిస్తున్నారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మొత్తం వాములు దగ్ధమై రూ.8లక్షలు నష్టం వాటిల్లిందని బాధిత రైతులు వాపోయారు. సీఐ రామారావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.