సుంకేసుల జలాశయంలో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి శుక్రవారం చేప పిల్లలను వదిలారు. ఏపీ మత్స్య శాఖ ఆధ్వర్యంలో 2.5 లక్షల చేప పిల్లలను జలాశయంలో వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నదీమతల్లికి హారతి పట్టి పూజలు చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. చేప పిల్లల పెంపకంతో మత్స్యకారుల జీవనోపాధి పెరుగుతుందన్నారు.