ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రంలో తొలిఏకాదశి సందర్బంగా ఆదివారం ఉదయం 5గంటల నుంచి భక్తులు పోటెత్తారు. స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేసారు. తొలుత ఆలయానికి చేరుకున్న భక్తులు కేశఖండనశాలలో తమ మొక్కుబడులు తీర్చుకుని, క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామి వారి మూల విరాట్ తో పాటు, అమ్మవార్లను దర్శించి, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం వకుళమాత అన్నదాన భవనం వద్ద ఉచిత అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. వృద్ధులకు వికలాంగులకు చంటి పిల్లల తల్లులకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. గోవింద నామ స్మరణలతో చినవెంకన్న శేషాచల కొండ మారుమోగింది.