కర్నూలు నగరాన్ని స్వచ్ఛందంగా ఉంచేందుకు నగర పాలక సంస్థ కమీషనర్ విశ్వనాథ వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఆదివారం ఉదయం ఖాళీ ప్రదేశాల్లో అశుభ్రంగా ఉండి ప్రజలకు అసౌకర్యంగా ఉన్న పబ్లిక్,ప్రైవేటు ప్రాంతాలను నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో శుభ్రం చేసే కార్యక్రమాన్ని కమీషనర్ ప్రారంభించారు. మొత్తం 30 జేసీబీలతో నగరంలో గుర్తించిన ప్రాంతాలను శుభ్రం చేసే కార్యక్రమానికి శ్రీకారం చూట్టారు. ఈకార్యక్రమం నిరంతరం ఉంటుందని కమీషనర్ తెలిపారు. స్థానిక ప్రజల ఫిర్యాదుతో బుదవార పేటలో ఉన్న వక్ఫ్ భూమిలో జేసీబీలతో శుభ్రం చేశారు. శుభ్రం చేసేందుకు అయ్యే ఖర్చు స్ధల యజమానుల నుంచి ఇప్పించుకుంటారమని కమీషనర్ తెలిపారు.