హిందూపురం పట్టణంలోని మేళాపురం సర్కిల్ సమీపంలో ఉన్న మస్జిద్ ఏ కౌసర్ కమిటీని రద్దుచేసి పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఆ ప్రాంత ముస్లిం మైనారిటీ యువకులు జిల్లా వక్ బోర్డు ఇన్స్ పెక్టర్ కు అన్ని ఆధారాలతో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. జామీయా మసీదు కమిటీతో మేళాపురం ప్రాంతంలోని ముబారక్ నగర్ లో గత 26 సంవత్సరాల క్రితం దాతల సహకారంతో మసీదు నిర్మాణం కోసం రూ. 4 లక్షలు వెచ్చించి 10 సెట్ల స్థలాన్ని కొనుగోలు చేసి ఆ భూమిని మస్జీద్ ఏ ముజాహిద్ పేరున ముత్వల్లి సమీవుల్లా పేరుతో రిజిస్టర్ చేశారు. అయితే ఆ స్థలంలో మసీదు నిర్మాణం చేపట్టకుండా మేళాపురం సర్కిల్ సమీపంలో దాతల సహకారంతో ఐదు సెట్ల