కోడుమూరు పట్టణంలోని 1వ సచివాలయాన్ని ఎంపీడీవో రాముడు గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలన్నారు. బయోమెట్రిక్ హాజరు వేయాలన్నారు. పెండింగ్ సర్వేలు పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. నిరుద్యోగ యువతీ, యువకులు కౌశలం పథకం కింద సచివాలయంలో ఎగ్జామ్ రాసే విధంగా బాధ్యత తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.