జిల్లాలోని అటవీ, గిరిజన ప్రాంతాల పరిధిలో అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అటవీ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన అంశాలపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్, రహదారులు, భవనాల శాఖల ద్వారా మంజూరైన పనులపై సమగ్ర సమీక్ష జరిపారు. ఇప్పటికే చేపట్టిన పనుల పురోగతిని, అటవీ, రెవెన్యూ శాఖల అనుమతుల మంజూరు స్థితిని వివరంగా అధికారుల నుండి తెలుసుకున్నారు.