చీమకుర్తి: దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో పూర్తి రాయితీ కల్పించడం అభినందనీయమని చీమకుర్తి దివ్యాంగుల సమాఖ్య అధ్యక్షుడు రఫీ అన్నారు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని ఏపీ ప్రభుత్వం ప్రభుత్వం దివ్యాంగులకు బస్సుల్లో 100% రాయితీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల పెన్షన్లను సైతం భారీగా పెంచిందన్నారు. దివ్యాంగుల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందన్నారు.