గంగవరం: మేలుమాయి గ్రామస్తులు మీడియాకు తెలిపిన సమాచారం మేరకు. ఏడవ తరగతి చదివే సంజన అనే బాలిక తినుబండారాలు తీసుకురావడానికి షాపుకు వెళ్తుండగా ఎక్కడి నుంచి వచ్చిందో ఓ పాము కాటు వేసింది. దీంతో భయభ్రాంతులకు గురైన బాలిక జరిగిన విషయాని కుటుంబీకులకు తెలిపింది. హుటాహుటిన పలమనేరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి సంజనను తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు.