అనంతపురం జిల్లా వజ్రకరూరు గ్రామంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్సీ కాలనీ నందు శుక్రవారం పౌరుహక్కుల దినోత్సవ కార్యక్రమం తహసిల్దార్ నరేష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ మోనాలిసా,ఎస్సై నాగస్వామి, ఎంఈఓ తిమ్మప్ప,సామాజికవేత్త అంబేద్కర్ అవార్డు గ్రహీత బెంజిమెన్, రెవెన్యూ సిబ్బంది,సోషల్ వెల్ఫేర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.