గూడూరు పట్టణంలో శనివారం హిందూ సమ్మేళనం అంగరంగ వైభవంగా జరిగింది. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని హిందు సమ్మేళనం జరిపించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున హాజరైన హిందువులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ముందు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తిమ్మగురుడు స్వామి ఆలయ ప్రాంగణంలో సభ నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన విశిష్ట అతిధులు హిందూ సమాజం పై జరుగుతున్న దాడులపై అప్రమత్తంగా ఉండాలని, ఆధ్యాత్మికతను అలవర్చుకోవడం వలన హిందూ సమాజానికి బలం ఏర్పడుతుందని తెలిపారు, ఐక్యతను చాటాలన్నారు.