అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో ఉన్న బాలాలయంలో శనివారం స్వామి టేకు విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్న దృష్ట్యా ఆలయంలో టేకు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆలయంలో వేకువజాము నుంచి అర్చకులు, వేదపండితులు స్వామికి అభిషేకాలు, అర్చనలు, హారతులు, మహామంగళ హారతి తదితర ప్రత్యేక పూజలు చేశారు. టేకు విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ పాల్గొన్నారు.