కోడుమూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముడుమలగుర్తి గ్రామంలో ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. కుటుంబ యజమాని ఆపరేషన్ నిమిత్తం ఆసుపత్రిలో చేరారు. ఆయన వెంట భార్య కూడా వెళ్ళింది. అయితే మంగళవారం వారు ఇంటికి చేరుకున్నారు. ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉంచిన బంగారు ఆభరణాలు, నగదు మాయమైనట్లు గుర్తించి లబోదిబోమన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు.