మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 108వ జయంతి సందర్భంగా వారికి నెక్లెస్ రోడ్డులో జరిగిన కార్యక్రమంలో చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రపంచపటంలో మరింత శక్తివంతంగా నిలిపిన దూరదృష్ట నాయకురాలు ఇందిరాగాంధీని కొనియాడారు. వ్యవసాయ విప్లవం, మహిళా సాధికారత, జాతీయ భద్రత, సామాజిక సంక్షేమ రంగాల్లో ఆమె చేసిన సేవలు నీటికీ కోట్లాది భారతీయులను స్ఫూర్తి పరుస్తూనే ఉన్నాయి.