శ్రీశైలం: ఆత్మకూరు పట్టణంలో బాబు వెన్నుపోటుకు రెండేళ్లు భారీ నిరసన కార్యక్రమం చేపట్టిన వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్న శిల్ప
చంద్రబాబు ఎన్నికల హామీల అమలులో విఫలమయ్యారని ఆరోపిస్తూ, బాబు వెన్నుపోటుకు రెండేళ్లు ఆ అనే నిరసన కార్యక్రమాన్ని శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరులో మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను పక్కనపెట్టి రాష్ట్రంలో ఆటవిక పాలన సాగిస్తున్నారని శిల్పా చక్రపాణి రెడ్డి విమర్శించారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో నంద్యాల టర్నింగ్ నుంచి గౌడ్ సెంటర్ వరకు చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను చేతబట్టి వైఎస్సార్సీపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి హామీల అమలును డిమాండ్ చేశారు.