ప్రభుత్వ ఆసుపత్రిలో తెల్లవారుజామున మరోసారి ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిచ్చిన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్
Anantapur Urban, Anantapur | Mar 31, 2026
అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరోసారి ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించారు. మంగళవారం తెల్లవారుజామున 5:30 గంటలకే ఆయన అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రెండు గంటల పాటు ఆసుపత్రి మొత్తం కలియతిరిగారు. ఎమ్మెల్యే దగ్గుపాటి రాకతో వైద్యులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముందుగా ఆయన ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లి అక్కడ అందుతున్న సేవలను పరిశీలించారు. రోగులు వారి అటెండర్లతో మాట్లాడారు. వైద్యులు బాగా స్పందించారా మీరు వచ్చిన ఎంతసేపటికి అడ్మిట్ చేసుకున్నారు.వంటి అంశాల గురించి కూలంకశంగా తెలుసుకున్నారు. అనంతరం ఆర్థో, గైనిక్, ఎంఎస్, ఎఫ్.ఎస్ వార్డులను పరిశీలించారు.