అనంతపురం జిల్లా కేంద్రంలో సోమవారం 11:30 గంటల సమయంలో అనంతపురం రూరల్ సిపిఐ పార్టీ మండల కార్యదర్శి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో అనంతపురం రూరల్ ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రాప్తాడు ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ రైతుల పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కూటమి ప్రభుత్వం కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయాలని ధరలు శరీకరణకు 3000 కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలని ఏపీ రైతు సంఘం పిలుపుమేరకు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున పేర్కొన్నారు.