అనంతపురం జిల్లా గుత్తి మండలం తురకపల్లి గ్రామానికి చెందిన జగన్ రెడ్డి అనే యువ రైతుకు మంగళవారం పాము కాటు వేయడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వివరాలిలా ఉన్నాయి. తురకపల్లి గ్రామానికి చెందిన జగన్ రెడ్డి తన పొలంలో వేరుశనగ పంట సాగు చేశాడు. పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి పైపులు మారుస్తుండగా పైపు కింద ఉన్న పాము కాటు వేసింది. రైతు అస్వస్థతకు గురి కావడంతో వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ఆసుపత్రికి తరలించారు. రైతు జగన్ రెడ్డిని వైసీపీ యువ నాయకుడు మంజునాథ్ రెడ్డి పరామర్శించారు.