ఫరూక్నగర్ మండలంలోని కంసాన్పల్లి గ్రామానికి చెందిన శేఖర్ రైలు పట్టాల పై పడి ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనపై శేఖర్ తల్లి బుధవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ ఇద్దరూ ఒక పార్టీకి చెందిన నాయకులు ఇంటికి వచ్చి లక్ష రూపాయలు ఇస్తాం తప్పుకోమని చెప్పారని అన్నారు. తప్పుకోలేదని నీ సంగతి చూస్తామని బెదిరించారని తెలిపారు. అలాగే ఇద్దరు వ్యక్తులు వచ్చి తనని బయటికి తీసుకువెళ్లారని ఆమె అన్నారు. తమకు న్యాయం చేయాలని శేఖర్ తల్లి వాపోయారు.