అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం 2025 డిసెంబర్ 3వతేదీ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశాల ప్రకారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో నగరంలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ విభిన్న ప్రతిభావంతుల ఆటల పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభా వంతుల కార్పొరేషన్ చైర్మన్ గడుపుటి నారాయణ స్వామి, జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పాల్గొని ఆటల పోటీలను ప్రారంభించారు.