గుంతకల్లు: గుత్తి మండలం బాచుపల్లి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం, మంటల్లో కాలిపోయిన రూ.2,80లక్షలు నగదు
అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి రామాంజనేయులు అనే వ్యక్తి ఇల్లు దగ్ధమైంది. బుధవారం ఎస్ఐ సురేష్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి పని నిమిత్తం ప్యాపిలి కి వెళ్ళాడు. అయితే ఇంట్లో ఎవరు లేకపోవడంతో షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించి ఇంట్లో ఉన్న బీరువా మొత్తం కాలిపోయింది. మంటల్లో బీరువాలో ఉన్న రూ.2,80 లక్షలు, విలువైన ఇంటి పత్రాలు, ఆధార్ కార్డులు, బ్యాంకు బుక్కులు కాలిపోయాయి. సుమారు 10 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.