శ్రీశైలం నియోజకవర్గం లో నేతల మధ్య మళ్లీ మొదలైన మాటల యుద్ధం. ఒకరిపై ఒకరు ఘాటైన వ్యాఖ్యలతో విమర్శలు
శ్రీశైలం నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. సున్నిపెంట ఇండ్ల స్థలాల వ్యవహారంపై హైకోర్టు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఇద్దరు ప్రధాన నాయకుల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. వెలుగోడు పట్టణంలో నిర్వహించిన మహానాడు సభలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రతిస్పందనగా శిల్పా చక్రపాణి రెడ్డి మీడియా సమావేశంలో ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.