శ్రీశైలం: తన పుట్టినరోజు సందర్భంగా శ్రీశైలభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దంపతులు
శ్రీశైలం శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులకు ఆలయ ఈవో శ్రీనివాసరావు,అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శ్రీస్వామివారికి రుద్రాభిషేకం,అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకుని దర్శించుకున్నారు దర్శనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో ఆలయ వేదపండితులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దంపతులకు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో శ్రీనివాసరావు శ్రీస్వామి అమ్మవార్లకు చిత్రపటం, అందజేశారు