శ్రీశైలం: మహానంది నల్లమల అటవీ ప్రాంతంలో క్షుద్రపూజలు కలకలం. అటవీ శాఖ అధికారుల దర్యాప్తు
మహానంది నల్లమల అటవీ ప్రాంతంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. మహానంది ఆలయం వెనక వైపున సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు నిర్వహించినట్లు ఆనవాళ్లు బయటపడ్డాయి. గుప్తనిధుల అన్వేషణ కోసమే ఈ క్షుద్రపూజలు నిర్వహించి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఘటన స్థలంలో కుంకుమ, పసుపు, నిమ్మకాయలు, ఇతర పూజా సామగ్రి కనిపించగా, సమీపంలో పలుచోట్ల గుంతలు త్రవ్విన ఆనవాళ్లు కూడా గుర్తించారు. దీంతో నిధుల కోసం దుండగులు అటవీ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.