కనిగిరి పట్టణంలోని ఒంగోలు బస్టాండ్ సెంటర్ నందు నూతనంగా నిర్మించనున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ ఏర్పాటు పనులను కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్క ఉగ్ర నరసింహారెడ్డి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ కాంస్య విగ్రహ ఏర్పాటు పనులపై అంబేద్కర్ డెవలప్మెంట్ కమిటీ, అధికారులతో ఎమ్మెల్యే చర్చించారు. అంబేద్కర్ పాత విగ్రహాన్ని తొలగించి వెంటనే కాంస్య విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన పనులను ప్రారంభించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.