పూర్ణిమ స్కూల్లో చిన్నారిపై ఆయా చేసిన దాడి ఘటన పైన బాలానగర్ ఏసిపి నరేష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అమ్మాయిని చిత్రహింసలు పెడుతున్నప్పుడు తీసిన వీడియో ఘటన ఆధారంగా కేసు నమోదు చేశామన్నారు. ఆయాను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. స్కూల్ పై కూడా కేసు నమోదు చేసి సంబంధిత డీఈవో తో పాటు చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు కూడా తెలియజేశామని ఏసిపి వెల్లడించారు.