దర్శి: విఠలాపురంలో సీతారాములవారి గుడి ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొన్న యాంకర్ శ్యామల
Darsi, Prakasam | Apr 13, 2025 తాళ్లూరు మండలం విఠలాపురం గ్రామంలో ఆదివారం జరిగిన సీతా రాములవారి గుడి ప్రతిష్ఠా మహోత్సవంలో సినీ నటి, యాంకర్ శ్యామల సందడి చేశారు. తొలుత గుడిలో రాములవారికి పూజలు చేసిన అనంతరం గ్రామస్థులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, వైసీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పాల్గొన్నారు.